telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ప్రయాణికుల రద్దీ

secunderabad railway station

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కారణంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ప్రయాణికుల రద్దీ పెరిగింది.దసరా పండగను పురస్కరించుకుని జంట నగరాల్లో నివసిస్తున్న పలు ప్రాంతాల వాసులు తమ సొంత ఊళ్లకు బయలుదేరి వెళుతున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచే ప్రయాణికుల రద్దీ మొదలైనప్పటికి ఈరోజు మరింతగా పెరిగింది. టీఎస్సార్టీసీ కార్మికుల సమ్మె కారణంగా రైళ్లలో ప్రయాణించేందుకు ప్రయాణికులు సిద్ధపడ్డారు.

దీంతో, సికింద్రాబాద్ లోని రైల్వేస్టేషన్ కు భారీ సంఖ్యలో ప్రయాణికులు చేరుకున్నారు. ఈక్రమంలో టికెట్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు బారులు తీరారు. విపరీతమైన రద్దీ కారణంగా రైల్వేస్టేషన్ లోపలికి ప్రయాణికులు వెళ్లేందుకు నానా తంటాలు పడుతున్నారు. ప్రయాణికుల మధ్య తోపులాట కారణంగా వారి మధ్యలో మహిళలు ఇరుక్కుపోయారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు.

 

Related posts