ఏపీ లోని గుంటూరు – తెనాలి రైల్వేస్టేషన్ల మధ్యన లైన్బ్లాక్ అమలు చేస్తోన్న దృష్ట్యా పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. ప్రయాణీకు లు ఇబ్బంది పడకుండా స్పెషల్ డెమూ ప్యాసింజర్ సర్వీసులను తెనాలి – రేపల్లె మధ్యన నడుపుతామని సీనియర్ డీసీఎం డీ వాసుదేవరెడ్డి తెలిపారు. ఈ నెల 21వ తేదీన ఎనిమిది సర్వీసులు తెనాలి – రేపల్లె – తెనాలి మధ్యన నడుపుతామన్నారు.
తెనాలి నుంచి ఉదయం 7.20, 10.15, మధ్యాహ్నం 1.15, సాయంత్రం 4.15 గంటలకు బయలుదేరి గంట సమయంలో రేపల్లెకు చేరుకొంటాయి. రేపల్లె నుంచి ఉదయం 9, మధ్యాహ్నం 12, 3 గంటలకు, సాయంత్రం 6 గంటలకు బయలుదేరి గంట వ్యవధిలో తెనాలికి చేరుకొంటాయి. ఈ సర్వీసులను ప్రయాణీకులు వినియోగించుకోవాలని సీనియర్ డీసీఎం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు
మాజీ సీఎంలను గృహనిర్బంధం చేయాల్సిన అవసరం ఏంటి? : గులాంనబీ ఆజాద్