telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్…ఇద్దరు ఉగ్రవాదుల హతం

Sringar Encounter 2 Terrarists Death 
జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని షోపియాన్ జిల్లా ఇమాంసాహిబ్ పట్టణంలోని అద్కర ప్రాంతంలో భద్రతాబలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. ఉగ్ర కదలికలున్నాయన్న సమాచారంతో  సోదాలు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు శుక్రవారం కాల్పులకు తెగబడ్డారు. తిరిగి భద్రతాబలగాలు ఎదురు కాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. 
షోపియాన్ జిల్లా ఇమాంసాహిబ్ పట్టణంలోని అద్కర ప్రాంతంలో మిలిటెంట్లు దాక్కున్నారని అందిన సమాచారం మేర భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. అంతలో మిలిటెంట్లు జవాన్లపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ ఆర్మీ జవాన్ గాయపడటంతో అతన్ని శ్రీనగర్ లోని ఆర్మీ బేస్ ఆసుపత్రికి తరలించారు. కాల్పుల జరిపిన ఉగ్రవాదుల  కోసం జవాన్లు గాలిస్తుండగా వారు తారసపడ్డారు. వారు కాల్పులు జరపడంతో ప్రతిగా జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ సందర్భంగా షోపియాన్ జిల్లాలో ఇంటర్ నెట్ సర్వీసును నిలిపివేశారు. 

Related posts