telugu navyamedia
క్రీడలు వార్తలు

మైకేల్ వాన్ కు వసీం జాఫర్ కౌంటర్‌…

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న సిరీస్ లలో ఆటగాళ్ల కంటే మాజీలు ఎక్కువగా మతాల ఆటలు ఆడుతున్నారు. అయితే ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టీ20లో కోహ్లీ సేన 8 వికెట్లతో తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ ఓటమిని ఎగతాళి చేస్తూ ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైకేల్ వాన్ ట్వీట్ చేశాడు. భారత టీ20 జట్టు కన్నా ఐపీఎల్‌లోని ముంబై ఇండియన్స్ జట్టే బాగుంది’ అని అన్నాడు. అయితే మైకేల్ వాన్ కామెంట్ అటు అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. అయితే వాన్ కు ఈ భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్‌ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ‘మీ జట్టులాగా అందరికి విదేశీ ఆటగాళ్లను ఆడించే అదృష్టం ఉండదు కదా వాన్’ అంటూ సమాధానం ఇచ్చాడు. అయితే ఇంగ్లాండ్ జట్టుకు ఆడే ఆటగాళ్లలో సగానికి పైగా వేరే దేశానికి చెందిన ఆటగాళ్లే ఉంటారు అనే విషయం తెలిసిందే. ఇక ఈరోజు ఈ రెండు జట్ల మధ్య రెండో టీ20 మొతేరా వేదికగా జరుగుతుంది. చూడాలి మరి ఇందులో ఎవరు విజయం సాధిస్తారు.

Related posts