telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మహా సముద్రం విడుదల తేదీ వచ్చేసింది…

ఆర్ ఎక్స్100 సినిమాతో  సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి. కార్తికేయ హీరోగా నటించిన ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈసినిమా తరవాత కొంత గ్యాప్ తీసుకున్న అజయ్ తన రెండో సినిమాకు మహాసముద్రం అనే పేరు పెట్టాడు. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోలు శర్వానంద్, సిద్దార్థ్ నటించనున్నారు. అయితే సిద్దార్థ్ తెలుగులో స్ట్రైట్ సినిమా చాలా కాలం అయింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించబోతున్న ఈ సినిమాలో అనూ ఇమాన్యుల్, అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ఈ మల్టీస్టారర్ సినిమా ‘మహా సముద్రం’ ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు  ఓ పోస్టర్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఇందులో శర్వానంద్, సిద్దార్థ్ ఇద్దరూ ఓ బోట్ పై కూర్చొని తీక్షణంగా సిగరెట్ తాగుతూ కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా సినిమా పై ఆసక్తిని కూడా పెంచింది. ఇక ఈ సినిమాలో యాక్షన్, డ్రామా, లవ్ ఉంటాయని అలాగే ఆర్ ఎక్స్ 100 తో హిట్ అందుకున్న అజయ్ ఇప్పుడు అంతకంటే సూపర్ హిట్ సినిమా తీయబోతున్నాడని ఇంతకముందే చిత్రబృందం తెలిపింది.

Related posts