telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

అమరావతి రైతులకు వైసీపీ మోసం చేసి 3000 రోజులయ్యింది : టీడీపీ రాష్ట్ర కార్యదర్శి

టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి నజీర్ మాట్లాడుతూ… రాజధాని అమరావతి ఉద్యమం నేటికీ 300 రోజులు.. కానీ వైసీపీ ప్రభుత్వం అమరావతి రైతులకు మోసం చేసి 3000 రోజులయ్యింది అని అన్నారు. రాష్ట్రంలో రాజధాని సమస్య భవిష్యత్ తరాలకు రాకుడదని ఆలోచనే 2014 లో ప్రజలు చంద్రబాబు ను ఎన్నుకున్నారు అని తెలిపారు. రాష్ట్రం విభజన తర్వాత ఎన్నో ఇబ్బందులు మధ్య చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఆ తర్వాత 2015 రాజధాని కోసం శంకుస్థాపన చేశారు అని చెప్పుకొచ్చారు. టీడీపీని చంద్రబాబుని నమ్మి ప్రజలు, 29 వెలపైగా రైతులు 33 వేల ఎక్కరాలు రాజధాని కోసం ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా దేశంలో ఒక్క నాయకుడు పిలుపునిస్తే ఇన్ని ఎకరాలు ఇవ్వడం ఒక్క చరిత్ర. అయితే రైతులు 5 కోట్ల ప్రజల కోసం అన్నాడు భూములు ఇచ్చారు. ప్రపంచం లో 8వ అద్భుతమైనది గా అమరావతి ఉండేది. చంద్రబాబు దూరపు చూపు చాలా గొప్పది అని చెప్పిన నజీర్ ఈ సమయంలో చంద్రబాబు అధికారంలో ఉంటే రాష్ట్ర ఆదాయ ఎంతో పెరిగేది అన్నారు. అసమర్థ ప్రభుత్వం వైసీపీ చంద్రబాబు పై అక్కసు తో అమరావతి ని చంపేయాలని చూస్తుంది. రాజధాని కోసం రైతులు ప్రాణాలు సైతం విడిచారు అని నజీర్ గుర్తుచేశారు.

Related posts