ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు జైలుకు పంపినా వెళతామని వ్యాఖ్యానించారు. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడేలా తమ పిల్లలకు కూడా నేర్పిస్తామని అన్నారు.
25 ఏళ్లుగా భద్రత లేకుండానే తిరుగుతున్నానని, తనను చంపేయాలనుకుంటే చంపేసుకోవచ్చని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు తన చెప్పుతో సమానమని అన్నారు. ముస్లింలకు కాంగ్రెస్ అవసరంలేదని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎప్పటికీ అధికారంలోకి రాదని ఒవైసీ జోస్యం చెప్పారు.