టెలికం రంగంలో రోజురోజుకు పోటీ తీవ్రతరం అవుతుంది. దీనితో రోజు సరికొత్త ఆఫర్లు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా, వొడాఫోన్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ను ప్రకటించింది. ఈ నెట్వర్క్లకు చెందిన వినియోగదారులు ఎవరైనా సరే.. ఎంత చిన్న మొత్తం లేదా పెద్ద మొత్తంలో ప్రీపెయిడ్ రీచార్జిలు చేసుకున్నా సరే.. కచ్చితమైన బహుమతిని పొందవచ్చు. అదనపు డేటా, కాల్స్, ఎస్ఎంఎస్లు, కాలర్ ట్యూన్స్ రూపంలో ఆ బహుమతులు వస్తాయి. ఇందుకు గాను కస్టమర్లు రీచార్జి చేసుకున్న వెంటనే మై ఐడియా యాప్లోకి లేదా *999# నంబర్ డయల్ చేసి తమకు లభించిన గిఫ్ట్ను పొందవచ్చు.
ఇందుకు కస్టమర్లకు రీచార్జి చేసుకున్నాక 72 గంటల వరకు సమయం ఉంటుంది. ఆలోగా గిఫ్ట్ను వారు క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఐడియా వెబ్సైట్, మై ఐడియా యాప్, ఇతర థర్డ్ పార్టీ యాప్ లేదా వెబ్సైట్, రిటెయిలర్.. ఎలా అయినా సరే.. ఎంత మొత్తంలో రీచార్జి చేసుకున్నా సరే కస్టమర్లు కచ్చితమైన బహుమతిని పొందవచ్చు. కాగా కస్టమర్లు ఎంత పెద్ద మొత్తం రీచార్జి చేసుకుంటే అంత ఎక్కువ పెద్దదైన బహుమతిని పొందవచ్చు. ఇక ఈ ఆఫర్ సెప్టెంబర్ మొదటి వారం వరకు అందుబాటులో ఉంటుందని వొడాఫోన్ ఐడియా ప్రతినిధి ఒకరు తెలిపారు.