అయోధ్యలో నిర్మించే రామాలయం పనులు త్వరలోనే వేగవంతమవుతాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆదివారం ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో శ్రీ జగద్గురు విశ్వారాధ్య గురుకులంలో జరిగిన కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ఆలయం నిర్మించేందుకు ఏర్పాటు చేసిన ‘రామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ ట్రస్టుకు మొత్తం 67 ఎకరాల భూమిని అప్పగించనున్నామని తెలిపారు.
అయోధ్యలో రాముడు జన్మించిన స్థలాన్ని మొత్తం 67 ఎకరాలను కొత్తగా ఏర్పాటు చేసిన శ్రీ రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు త్వరలో అప్పగించనున్నాం. మన సాంప్రదాయాలు, సంస్కృతులే మన దేశానికి గుర్తింపు అని, అది పాలకులు నిర్ణయించేది కాదని మోదీ పేర్కొన్నారు. ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అన్నదాన్ని బట్టి మన దేశానికి ఎప్పుడూ గుర్తింపు లేదన్నారు.
విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడం దారుణం: చంద్రబాబు