telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

“అచ్చోసిన ఆంబోతులా” విజయసాయిరెడ్డి: కన్నా

Kanna laxminarayana

లాక్ డౌన్ సమయంలో ‘అచ్చోసిన ఆంబోతులా’ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తిరుగుతున్నారని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద నుంచి తాను రూ.20 కోట్లు తీసుకుని ఆయనకు అనుకూలంగా మాట్లాడుతున్నానంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను కన్నా ఖండించారు.

గుంటూరులో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాణిపాకం వినాయకస్వామి గుడిలో ప్రమాణం చేస్తానన్న మాటకు తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. విజయసాయిరెడ్డి కూడా కట్టుబడి ఉంటాడని అనుకుంటున్నానని అన్నారు. లాక్ డౌన్ ముగిసిన అనంతరం ఓ తేదీ నిర్ణయిస్తానని, ఆరోజున గుడిలో ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు.

Related posts