telugu navyamedia
రాజకీయ వార్తలు

సరదాగా మాత్రమే ఆ వ్యాఖ్యలు చేశాను: ట్రంప్ వివరణ

trump usa

కరోనాను అంతమొందించడానికి క్రిమి సంహారక మందులను శరీరంలోకి ఎక్కించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువిరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తీవ్ర విమర్శల పాలైన ట్రంప్, తన వ్యాఖ్యలను కప్పిపుచ్చుకునే ప్రయత్నిం చేశారు. ఇటీవల ఆయన ఓ మీడియా సమావేశంలో పెస్టిసైడ్స్ ను మానవ శరీరంలోకి పంపాలని, అల్ట్రా వయోలెట్ రేస్ ను కూడా పంపిస్తే, కరోనా క్రిములు మరణిస్తాయని అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు.

దేశాధ్యక్షుడి స్థాయిలో ఉండి, ఇటువంటి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర దుమారం చెలరేగింది. సొంత పార్టీ సభ్యులు సైతం ఆయన వ్యాఖ్యలను ఖండించగా, తాజాగా ట్రంప్ ఈ విషయమై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు కేవలం వ్యంగ్యోక్తులేనని, వాటిని సీరియస్ గా ఎందుకు తీసుకుంటారని ప్రశ్నించారు. తాను సరదాగా మాత్రమే ఆ వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చారు.

Related posts