telugu navyamedia
రాజకీయ వార్తలు

ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ “దత్తాత్రేయ హోసబలే”.

‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ’ ప్రతినిధి సభ ఆదివారం జరిగిన ప్రధాన సభ లో మళ్లీ కార్యదర్శి (సర్కార్యవాహ్) గా దత్తాత్రేయ హోసబలేని ఎన్నుకుంది. 2021 నుంచి హోసబలే ఈ పదవిలో ఉంటున్నారు.

2024 నుంచి 2027 వరకు ఈ పదవిలో దత్తాత్రేయ హోసబలేని ఉండేలా తిరిగి ఎన్నుకున్నారు. నాగ్‌పూర్ లోని రేషింబాగ్‌లో స్మృతి భవన్ కాంప్లెక్స్‌లో ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ వార్షిక సమావేశం శుక్రవారం నుంచి ఆదివారం వరుకు మూడు రోజుల పాటు జరిగింది.

ఆరేళ్ల తరువాత ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కేంద్రం నాగ్‌పూర్‌లో ఈ సమావేశం జరగడం విశేషం. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థలకు చెందిన వారు దాదాపు 1500 ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు కావటం ప్రత్యేకం.

Related posts