జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు శనివారం ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో రావెల కిషోర్ బాబు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇవాళ సాయంత్రం ప్రధాని తిరుమలకు రానున్నారు. అయితే ఈ పర్యటనలో భాగంగా మోదీ సమక్షంలో రావెలతో పాటు పలు పార్టీలకు చెందిన నేతలు కమలం గూటికి చేరనున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో దిగులు పడకుండా ఎవరికి వారు స్వీయ పరిశీలన చేసుకుని ముందుకు వెళ్దామంటూ పిలుపునిచ్చారు. అనంతరం జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్న రావెల కిషోర్ బాబు శనివారం పార్టీకి రాజీనామా చేశారు. నేడు బీజేపీ తీర్థం పుచ్చుకొనున్నారు.