telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సింగూరు జలాలపై కేసీఆర్‌ స్పందించాలి: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

Jaggareddy gives clarity party change

సింగూరు జలాలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పందించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. సింగూరు జలాల కోసం తన భార్యతో కలిసి దీక్ష చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈనెల 18న తాను, తన భార్య నిర్మల దీక్ష చేస్తామని ఆయన తెలిపారు. సింగూరు నీళ్ల కోసం తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.

సంగారెడ్డిలో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ జీవో లేకుండా నీళ్లు తరలించడం అక్రమమని మండిపడ్డారు. నీటి తరలింపునకు కారణం హరీష్‌రావే అని ఆయన ఆరోపించారు. సింగూరును తన జాగీరులా హరీష్‌ వ్యవహరించారని దుయ్యబట్టారు. సింగూరు డ్యామ్‌ని నింపుతామన్న మాట నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.

Related posts