కంటోన్మెంట్ బొల్లారం కోవిడ్ ఆస్పత్రిని ప్రారంభించారు మాల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఎనుముల రేవంత్ రెడ్డి. మాల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల కోసం కంటోన్మెంట్ బొల్లారం పీహెచ్సీని 50 పడకల కోవిడ్ ఆస్పత్రిగా మార్పు చేసి చికిత్స అందించాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. కంటోన్మెంట్ బొల్లారం పీహెచ్సీని దతత్త తీసుకున్న ఎంపీ రేవంత్ రెడ్డి… నియోజకవర్గ ప్రజలకు కోరనా చికిత్స అందించేందుకు ఎంపీ రేవంత్ రెడ్డి తన సొంత నిధులు, ఎంపీ నిధులు ఖర్చు చేయనున్నారు. కోవిడ్ ఆస్పత్రి ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు 20 రోజుల క్రితం పనులు ప్రారంభిచ్చనున్నారు. 50 ఆక్సిజన్ బెడ్స్ సామర్థ్యంతో కోవిడ్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక్కడి నుంచే నియోజకవర్గ ప్రజలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించాలని.. త్వరలో 100 ఆక్సిజన్ పడకల సామర్థ్యంతో పూర్తి స్థాయి కోవిడ్ ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
previous post
ఎవరికి వారే హీరోలు అనుకుంటే కాంగ్రెస్లో నడవదు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి