telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

లోకేశ్ లాంటి వింత జీవి ఇంకెక్కడా కనిపించడు : విజయసాయిరెడ్డి

నారా లోకేష్ పై మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. లోకేష్ లాంటి వింత జీవి అస్సలు భూమి పైన కనిపించదని ఎద్దేవా చేశారు. “18-45 మధ్య వయసు వారికి ఉచిత వ్యాక్సిన్లు ఇస్తామని మొదట ప్రకటించింది సిఎం జగన్ గారే. ఆ తర్వాతే కేంద్రం ఫ్రీ వ్యాక్సిన్ నిర్ణయం వెల్లడించింది. కరోనాపై కేంద్రానికి నివేదికలు పంపుతుంటానని డప్పు కొట్టుకునే బాబుకు ఇది కనిపించలేదా. విషం చిమ్మడమే కాదు. మెచ్చుకోవడం కూడా నేర్చుకో బాబూ. లోకేశ్ లాంటి వింత జీవి భూమ్మీద ఇంకెక్కడా కనిపించడు. టెన్త్, ఇంటర్ పరీక్షలు తనే రాసాడో, బాబు ఇంకెవరితోనైనా రాయించాడో! పిల్లల భవిష్యత్తును నాశనం చేయడానికి పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. కరోనా ప్రోటో కాల్స్ ప్రకారమే ఎగ్జామ్స్ జరుగుతాయి. నీ బాధేంటి పప్పు నాయుడు? ప్రతిపక్ష నేతగా ఖజానా నుంచి జీత భత్యాలు తీసుకుంటున్న చంద్రబాబుకు ప్రజలపట్ల ఏ బాధ్యత లేదా? ఎన్నికల్లో చితక పొడిచారని పక్క రాష్ట్రంలో తలదాచుకున్నాడు. కుల మీడియా ఎప్పట్లాగే పిడకలు విసురుతోంది. వీళ్లు మారారు. ప్రజలు బాబు పట్ల తమ అభిప్రాయాన్ని ఎలాగూ మార్చుకోరు.” అంటూ చురకలు అంటించారు విజయసాయిరెడ్డి.

Related posts