నాకు నమ్మక ద్రోహం చేసినవారు బాగుపడరని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు కొట్లాడటం మాత్రమే తెలుసని దొంగదెబ్బ తీయడం చేతకాదని అన్నారు. ప్రజలు ధర్మాన్ని నమ్ముతారు కాబట్టే గత ఎన్నికల్లో తాను గెలుపొందానని చెప్పారు.
కోట్లు ఖర్చయినా తాను ఎవరి వద్ద చేయి చాచలేదని చెప్పారు. ప్రజలు కూడా ధర్మం తప్పి ఉంటే తాను ఓడిపోయేవాడినని చెప్పారు. గత ఎన్నికల్లో ఈటల ఓటమి కోసం టీఆర్ఎస్ లోనే ఓ వర్గం పని చేసినట్టు ప్రచారం జరుగుతోంది. నమ్మినవారే మోసం చేస్తే బాధ కలుగుతుందని వ్యాఖ్యానించారు.