telugu navyamedia
క్రీడలు వార్తలు

ఆర్సీబీ పరువు తీసిన యువీ..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లెగ్‌స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సోషల్ మీడియాలో ఫన్నీ ప్రవర్తనకు ప్రసిద్ది చెందాడు. ఇటీవలే, అతను భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తో ట్విట్టర్ పరిహాసానికి పాల్పడ్డాడు. అయితే తాజాగా యువీ ప్లేఆఫ్స్‌ కు ఎవరు అర్హత సాధిస్తారో, ఫైనల్ ఎవరు ఆడతారు అనే తన అంచనాను ట్వీట్ చేశాడు.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుండగా, యువరాజ్ సింగ్ నికోలస్ పూరన్ బ్యాటింగ్ ను ప్రశంసించాడు. మరియు పంజాబ్ ముంబై ఇండియన్స్ లేదా ఢిల్లీ క్యాపిటల్స్ తో ఫైనల్ ఆడుతుంది అని తెలిపాడు. దానికి ”అప్పుడు మనం ఏమి చేయాలి? భారతదేశానికి తిరిగి వెళ్లాలా?” అని చాహల్ స్పందించాడు. దానికి ”ఇంకా కొన్ని బౌండరీలు, సిక్సర్లు కొట్టి ఐపీఎల్‌లో కొన్ని వికెట్లు పడగొట్టిన తర్వాతే తిరిగి రండి” అని యువరాజ్ కామెంట్ జోడించాడు. మళ్ళీ దానికి ”సరే. నవంబర్ 10 న గెలిచి వస్తాం అని చాహల్ తెలపగా. ఫైనల్ చూసిన తర్వాత మాత్రమే తిరిగి రండి అని యువరాజ్ అన్నాడు. అంటే యువీ బెంగళూరు ఫైలాన్ చూస్తుంది కానీ ఆడదు అని చెప్పేసాడు.

Related posts