telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎన్నికల అయిపోయాక..కేసీఆర్ మళ్ళీ బయటకి రావడం లేదు

BJP Bandi sanjay

పదవుల కోసం ఆలోచన చేయని వ్యక్తి పీవీ నరసింహ రావు అని… దేశంలో మెజార్టీ ప్రజల నిర్ణయం మేరకు రామ జన్మభూమి కోసం పీవీ తమ పాత్ర పోషించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
ప్రజాదరణ పొందిన వ్యక్తి పీవీ నరసింహారావు అందుకే దేశంలో ఎక్కడ పోటీ చేసిన వారు గెలిచారని కొనియాడారు. సీఎం కేసీఆర్ ఎక్కడ ఉన్నారో తెలవడం లేదని…అంత బిజీ ఏముంది ఎందుకు వర్ధంతి కార్యక్రమంకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. శత జయంతి ఉత్సవాలు ఎక్కడ కనపడడం లేదని…. హోర్డింగ్ లు పెట్టారు డబ్బులు దొబ్బరన్నారు. ghmc ఎన్నికల కోసం పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు జరిపారని… ఎన్నికల అయిపోయాక సీఎం కేసీఆర్ మళ్ళీ బయటకి రావడం లేదని ఎద్దేవా చేశారు. ఈరోజు అంత బిజీ ఏముంది సీఎం కేసీఆర్ కి ఆయన షెడ్యూల్ బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. అంబేడ్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ రారు… పీవీ నరసింహారావు వర్ధంతి రోజు కూడా కేసీఆర్ రాకపోవడమం పీవీని అవమానించడమేన్నారు.

Related posts