telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

పేకాట స్థావరంపై పోలీసుల దాడి..పట్టుబడ్డ ఎస్ఐ!

playing cards

పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఊహించని విధంగా ఎస్సై పట్టుబడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోచోటు చేసుకుంది. నిజాంపట్నం తీర ప్రాంతంలో పేకాట ఆడుతున్న శిబిరంపై స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడి చేశారు.

ఈ దాడిలో ఒక ఎస్సై సహా, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టుబడ్డారు. అయితే పై నుంచి ఒత్తిడి రావడంతో ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పలుచోట్ల పేకాట జోరుగా సాగుతోంది.

Related posts