telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

జగన్మోహన్ రెడ్డి గన్నేరు పప్పు : బోండా ఉమామహేశ్వరరావు

టీడీపీ లీడర్ బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ… విశాఖలో భూములు కొల్లగొట్టడానికే అమరావతి ఉద్యమంపై సజ్జల దుష్ప్రచారం చేస్తున్నారు అన్నారు. రైతు ద్రోహి సజ్జల రామకృష్ణారెడ్డి లోకేష్ గారి గురించి మాట్లాడటమా? మరావతి ఉద్యమం లేకపోతే వేలాది మంది పోలీసులను ఎందుకు పెట్టారు? అని ప్రశ్నించారు. విశాఖలో ఈ 15 నెలల్లో 72 వేల రిజిస్ట్రేషన్లు జరగడం నిజమైన ఇన్ సైడర్ ట్రేడింగ్ . పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా 25వేల కి.మీ సిమెంట్ రోడ్లను నారా లోకేష్ నిర్మించారు అని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గన్నేరు పప్పు.. కేంద్రం పంపించిన కందిపప్పు, బియ్యాన్ని పందికొక్కుల్లా మాయం చేస్తున్నారు అని అన్నారు. చంద్రబాబునాయుడు వ్యవసాయంలో 11 శాతం వృద్ధి సాధించి రైతు బాంధవుడిగా నిలిచారు. తుఫానుల్లో పంట నష్టపోయిన రైతులకు 50శాతం నుంచి 100 శాతం వరకు పరిహారం పెంచి ఇచ్చారు అని అన్నారు.

నేడు 4 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతింటే.. రైతులను వారి మానాన వారిని వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి. అమరావతిలో ఒక్క ఎకరా కూడా చట్టవ్యతిరేకంగానూ, అధర్మంగానూ కొనుగోళ్లు జరగలేదని 29వేల మంది రైతులు ఘోషిస్తున్నారు. సజ్జల ఏమైనా చెవుల్లో సీసం పోసుకున్నారా? అందుకే వినపడలేదా? అని అడిగారు. సజ్జల గారు మద్యంలో వేలాది కోట్లు ముడుపులు వసూలు చేస్తూ, నాసిరకం మద్యం పోస్తూ తన అవినీతిని కప్పిపెట్టుకోవడానికి లోకేష్ పైన నిరాధార నిందలు వేస్తున్నారు. మీ అవినీతిని, అరాచకాన్ని కట్టిపెట్టి రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది రైతులు కోరే విధంగా మీ తప్పుడు నిర్ణయాలను మార్చుకుని అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించకపోతే జగన్ రైతులు గద్దె దించడం ఖాయం అని తెలిపారు.

Related posts