telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఢిల్లీకి బయల్దేరిన కేసీఆర్

KCR cm telangana

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక కేసీఆర్ తో భేటీ కావడం ఇదే తొలిసారి. ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు.

రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఈ భేటీలో చర్చిస్తారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ నిధులను పెంచాలని ఈ సందర్భంగా మోదీని కేసీఆర్ కోరనున్నారు. రాష్ట్రంలో ఏదో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఇవ్వాలని ప్రధానిని సీఎం కోరనున్నారు. విభజన హామీలను అమలు చేయాలని, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రధానికి విన్నవించనున్నారు.

Related posts