telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

బ్లేడ్ల‌తో దాడి చేసుకున్న విద్యార్థులు…

ఓ అమ్మాయి కోసం ఏపీలో ఇంటర్ విద్యార్థులు గొడవ పడ్డారు. ఈ గొడవలో ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్న త్రినాధ్ అనే విద్యార్థి సంతోష్ అనే విద్యార్థి పై బ్లేడుతో దాడి కి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన సంతోష్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీ అయిపోయిన తర్వాత పరస్పరం ఒకరి మీద ఒకరు దాడి చేసుకుని గొడవకు దిగారు. మల్కాపురం జయేంద్ర కాలనీ కి చెందిన త్రినాధ్ దాడి అనంతరం పరారయ్యాడు. వెంటనే గాయాలపాలైన బాధితులు సంతోష్ ను స్థానిక హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు త్రినాథ్ కోసం వెతుకుతున్నారు. దాడికి గల కారణం ప్రేమ వ్యవహారమే అని అనుమానిస్తున్నారు పోలీసులు. ఫస్ట్ ఇయర్ శ్రీ చైతన్య కాలేజీలో నిందితుడు సంతోష్ చదవగా అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో టీసి ఇచ్చి కాలేజీ యాజమాన్యం పంపించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటన పై పోలీసుకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts