టీడీపీ అధినేత చంద్రబాబు 40 ఏళ్లుగా దోచుకుంటూనే ఉన్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. బాబు దోపిడిని ప్రజలు గుర్తించబట్టే తరిమికొట్టారని చెప్పారు. మరోసారి ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో సాక్షిగా అడ్డంగా దొరికిపోయారని అన్నారు. 18 అవినీతి కేసుల్లో స్టేలు తెచ్చుకుని ఇప్పుడు సుమతి శతకాలు వల్లిస్తున్నారని దుయ్యబట్టారు.
ప్రజలు తుపుక్కున ఉమ్మేసి ఆరు నెలలు కూడా గడవలేదని అన్నారు. కానీ పరాజితులంతా చీకటి మాటున చేతులు కలిపి వీధుల్లో పెడబొబ్బలు పెడుతున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. చూసే వాళ్లకు అసహ్యం వేస్తున్నా, వీళ్లకు మాత్రం సిగ్గనిపించడం లేదన్నారు. వీళ్లకు పచ్చ మీడియా ప్రచారం దొరుకుతుందేమో కానీ, ప్రజాభిమానాన్ని మాత్రం సంపాదించుకోలేరని దుయ్యబట్టారు.
మంచు ఫ్యామిలీ అంటే ముంచే ఫ్యామిలీ: కుటుంబ రావు