telugu navyamedia
రాజకీయ వార్తలు

నేడు ఈడీ విచారణకు శరద్ పవార్..కార్యలయం వద్ద భారీ ఆందోబస్తు

Loksabha Elections MP Contest Sharad pawar

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతానికి జనాలు భారీ సంఖ్యలో రాకుండా ఆంక్షలు విధించారు. మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ మనీ లాండరింగ్ కుంభకోణం విచారణకు సంబంధించి శరద్ పవార్ నేడు మధ్యాహ్నం ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు.

వాస్తవానికి శరద్ పవార్ కు ఇంత వరకు ఈడీ సమన్లు పంపలేదు. కానీ, మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో, రానున్న రోజుల్లో ప్రచారానికి సంబంధించి బిజీ కాబోతున్న నేపథ్యంలో… ఆయనే తనంతట తానుగా ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో పోలీసులు సెక్షన్ 144 విధించారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నట్టు శరద్ పవార్ నిన్న ట్వీట్ చేశారు. ఈడీ కార్యాలయం వద్దకు ఎవరూ రావద్దంటూ పార్టీ శ్రేణులకు ఆయన విన్నవించారు.

Related posts