ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈ రోజు సాయంత్రం పలుచోట్ల అనూహ్యంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈదురుగాలులు, పిడుగులతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో పిడుగులు పడడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ఈదురు గాలుల తీవ్రతకు చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ప్రకాశం జిల్లా పశ్చిమప్రాంతంలోని పుల్లలచెరువు మండలంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. మండలంలోని గాజులపాలెంలో బలమైన ఈదురుగాలులకు పలుచోట్ల ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి.
రాజధాని విషయంలో తమది ఎప్పుడూ ఒకే మాట: లోకేశ్