కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 224 సీట్లలో 141 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీ ఆ పార్టీ యావత్ కేంద్ర నాయకత్వాన్ని ఎన్నికల ప్రచారంలో మోహరించిందని, అయితే మోదీ మ్యాజిక్ కర్ణాటకలో పనిచేయదని చెప్పారు. ప్రజలు పూర్తిగా స్థానిక, అభివృద్ధి అంశాలపై దృష్టి సారించారని అన్నారు. తనకు, తమ పార్టీ నేత సిద్ధరామయ్యకు మధ్య ముఖ్యమంత్రి పదవి విషయంలో ఎలాంటి పోటీ లేదని, తమ ఏకైక లక్ష్యం ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించి, కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడమేనని ‘పీటీఐ’ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో శివకూమార్ చెప్పారు.
previous post
next post
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై దత్తాత్రేయ ఫైర్