telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

జిల్లా అధికారుల నిర్లక్ష్యం పై మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఫైర్…

గుంటూరు జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అధికారుల పైన ఫైర్ అయ్యారు. సమావేశానికి ఎక్కవ మంది అధికారులు రాకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేసారు ఆయన. జిల్లాలో 223 ఎస్సీ,ఎస్టీ కేసులు నమోదయ్యాయి. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్లే కేసులు ఇంకా పెండింగ్ లో ఉంటున్నాయి అని పేర్కొన్నారు. చట్టం పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా పని చేయాలి అని ఆర్కే అధికారులకు సూచించారు. 2020లో కూడా బలవంతుడు బలహీణుడిని అణగతొక్కుతున్నారు అని చెప్పిన ఆయన ముఖ్యమైన సమావేశానికి హాజరవడంలో అధికారులు ఇంత నిర్లక్ష్యం గా ఉంటారా అని ప్రశ్నించారు. జిల్లా అధికారుల నిర్లక్ష్య వైఖరిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అని హెచ్చరించారు. ఎక్కువ సంఖ్యలో ఎస్సీ ఎస్టీ కేసులు పెండింగ్ లో ఉండడం బాధాకరం అన్నారు. ఎంత ఒత్తిడి ఉన్నా చట్టాన్ని అమలు చేయడంలో అధికారులు వెనుకాడకూడదు అని తెలిపారు.

Related posts