telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పాత్రికేయులకు రూ.10 లక్షల బీమా కల్పించాలి: కన్నా

Kanna laxminarayana

రాష్ట్రంలో పాత్రికేయులకు రూ.10 లక్షల బీమా కల్పించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మేరకు ఏపీ సీఎం జగన్ కు ఓ లేఖ రాశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పాత్రికేయులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారనిఅన్నారు.

రాష్ట్రంలో కూడా కొందరు జర్నలిస్టులు వార్తా సేకరణకు వెళ్లిన సమయంలో ‘కరోనా’ బారినపడ్డారని తెలిపారు. పాత్రికేయులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు హర్యానా మాదిరి ఏపీలోనూ జర్నలిస్టులకు బీమా కల్పించాలని లేఖలో కోరారు.

Related posts