telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ధర్మాన్ని కాపాడాల్సిన వారు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు: విజయసాయి

Mp vijayasai reddy

ధర్మాన్ని కాపాడాల్సిన వారు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. పార్లమెంటు ప్రాంగణంలో వైసీపీ ఎంపీలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ చట్టం ముందు అందరూ సమానులే అనే సూత్రాన్ని న్యాయ వ్యవస్థ విస్మరిస్తోందని చెప్పారు.

పౌరుల ప్రాథమిక హక్కులను హరిస్తున్నాయని, మీడియా గొంతు నొక్కుతున్నాయని జుడీషియరీపై ఆరోపణలు చేశారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.ఏపీలో న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై ఏపీ హైకోర్టు విధించిన స్టేలకు సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు.

Related posts