telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ యాత్రికుల కోసం జ‌గ‌న్ లేఖ రాయాలి: సోము వీర్రాజు

Somu Veerraju BJP

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని అయోధ్య‌లో రామాల‌య నిర్మాణానికి ఇటీవ‌లే భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. త్వరలో రామాల‌య నిర్మాణం జరగనున్న నేపథ్యంలో అక్క‌డ ఏపీ యాత్రికుల కోసం వ‌స‌తి నిర్మాణం కోసం చొర‌వ‌చూపాల‌ని ఏపీ సీఎం జగన్ ను ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు కోరారు.

రాష్ట్రం నుంచి అయోధ్యకు శ్రీరాముని దర్శనాని కోసం వెళ్లే యాత్రికుల వసతి గృహ నిర్మాణానికి రెండు ఎకరాల భూమిని కేటాయించమని కోరుతూ యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ గారికి జగన్ గారు లేఖ రాయాలని కోరారు. కర్ణాటక యాత్రికుల కోసం యోగి ఆదిత్య‌నాథ్ కు లేఖ రాసిన క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి యె‌డియూర‌ప్ప గారిని నేను అభినందిస్తున్నానని పేర్కొన్నారు.

Related posts