telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఇక మిగిలింది ఆఖరి దశ.. ముగిసిన ఆరవ దశ ప్రచారం.. 12న పోలింగ్ ..

congress rafel campaign in social media

విడతల వారీగా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగా నేటితో ఏడు రాష్ట్రాల్లో ఆరో దశ లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఏడు రాష్ట్రాల్లోని 59 స్థానాలకు ఈ నెల 12న ఎన్నికల పోలింగ్ జరగనుంది.

ఢిల్లీలోని 7, హరియానాలోని 10, జార్ఖండ్ లోని 4, మధ్యప్రదేశ్ లోని 8, ఉత్తరప్రదేశ్ లోని 14, బీహార్ లోని 8, పశ్చిమ బెంగాల్ లోని 8 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆరో దశ ఎన్నికలు జరగనున్న అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మిగిలింది చివరి దశ, ఈ నెల 19న జరగనున్నాయి.

Related posts