telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సంయమనంతో మాట్లాడాలి.. బొత్సకు పవన్ హితవు

pawan-kalyan

ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విమర్శనాస్త్రాలు సంధించారు. మంత్రి బొత్స సంయమనంతో మాట్లాడాలని పవన్ హితవు పలికారు. గతంలో వోక్స్ వ్యాగన్ కేసు మళ్లీ తెరపైకి వస్తుందేమో చూసుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సరిపోతుందనుకుంటే సీన్ రివర్స్ అవుతుందన్నారు. రాజధాని రైతుల కంట కన్నీరు పెట్టొద్దని సూచించారు.

గత ప్రభుత్వం కూడా రైతుల కన్నింటినీరు వచ్చేలా ప్రవర్తించారని ఫలితం అనుభవించారని చెప్పుకొచ్చారు. ప్రజల కంట కన్నీరు పెట్టిస్తే ఈ ప్రభుత్వం కూడా మనుగడ సాధించదన్నారు. ప్రధాని నరేంద్రమోదీ వచ్చి రాజధానిని శంకుస్థాపన చేశారన్న విషయం గుర్తుందా అంటూ నిలదీశారు. ఇకనైనా మా మాట వినకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. రాజకీయంలో చాలా సీనియర్ అయిన బొత్సపెద్దరికం నిలబెట్టుకోవాలని హితవు పవన్ పలికారు.

Related posts