telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అభివృద్ధికి బదులుగా విధ్వంసం: కేశినేని ఫైర్

kesineni nani tdp

వైసీపీ సర్కార్ పై టీడీపీ ఎంపీ కేశినేని నాని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధికి బదులుగా విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి చేయడం చేతకాకపోతే చెప్పండి, మేం చేసి చూపిస్తాం అంటూ వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటను ప్రస్తావిస్తూ ఆయన ఢిల్లీ ఎందుకువెళ్లారు. అభివృద్ధి కోసమేనా? లేక సొంత పనుల నిమిత్తం అమిత్ షా కాళ్లు పట్టుకునేందుకు వెళ్లారా? అని ప్రశ్నించారు. స్వంత పనుల కోసం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారనిఆరోపించారు.

ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలకు హాజరైన కేశినేని నాని ఇటీవల జరిగిన ఆంధ్రజ్యోతి జర్నలిస్టు హత్య విషయాన్ని లోక్ సభలో లేవనెత్తారు. దీనికి కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ బదులిస్తూ, ఈ ఘటనపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుమోటోగా స్వీకరించి దర్యాప్తు షురూ చేసిందని లిఖితపూర్వకంగా తెలియజేశారు.

Related posts