telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

‘కరోనా’కారణంగా కేసీఆర్ ఫ్యామిలీకి కనకవర్షం: రేవంత్ రెడ్డి ఆరోపణ

Revanth-Reddy mp

కరోనా వైరస్ కారణంగా కేసీఆర్ ఫ్యామిలీకి కనకవర్షం కురుస్తోందని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువులు డైరెక్టర్ గా ఉన్న ఫార్మా కంపెనీకి రూ.140 కోట్ల పెట్టబడులు వచ్చాయని ఆరోపించారు. పాకాల రాజేంద్రప్రసాద్ డైరెక్టర్ గా చేరిన రాక్సెస్ లైఫ్ సైన్స్ కి కొన్ని రోజులకే వందల కోట్ల రూపాయలు వచ్చాయని, ఇప్పుడు హైడ్రాక్సిన్ క్లోరో క్విన్ ఉత్పత్తి కోసం రూ.10 వేల కోట్ల ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు.

ఈ సంస్థకు కేంద్రం ఒప్పందం కోసం కేసీఆర్, కేటీఆర్ లు మధ్యవర్తిత్వం చేశారని ఆరోపించారు. వేల కోట్ల రూపాయలు ఎగుమతులు చేసే, లక్షల రూపాయల ట్యాక్స్ లు కట్టే ఫార్మా కంపెనీలకు కాకుండా ఇలాంటి అర్హత లేని కంపెనీకు ఒప్పందం ఎలా కుదిరింది? అని ప్రశ్నించారు. తన బంధువుల కోసం రాష్ట్రాన్ని కేంద్రం దగ్గర పణంగా పెట్టి ఒప్పందం చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగాప్రధాని మోదీ, బీజేపీపైనా ఆయన ధ్వజమెత్తారు. టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనని విమర్శించారు. అర్హత లేని కంపెనీలతో ఒప్పందం ఎలా చేసుకున్నారో చెప్పాలని బీజేపీని డిమాండ్ చేశారు.

Related posts