తెలంగాణ సీఎం కేసీఆర్ పై మంత్రి గంగుల కమలాకర్ ప్రశంసలు కురిపించారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా కరీంనగర్ జిల్లాకు నాలుగు మంత్రి పదవులు ఇచ్చారని గంగుల అన్నారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.ఆయానో డిక్షనరీ అని కమలాకర్ అభివర్ణించారు. కేసీఆర్ కు కరీంనగర్ జిల్లా సెంటిమెంట్ అని అందుకే జిల్లాకు వినోద్కి క్యాబినెట్ రాంక్తో కలిపి జిల్లాకు మొత్తం ఐదు పదవులు వచ్చాయన్నారు.
2009లో తాను టీడీపీ నుంచి గెలిచానని, తెలంగాణ కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షతో తాను టీఆర్ఎస్లో చేరానన్నారు. దీంతో తన వల్లే తెలంగాణకు టీడీపీ అనుకూలంగా లేఖ ఇచ్చిందన్నారు. 2018లో కేసీఆర్ బొమ్మతోనే గెలిచానని, కేసీఆర్ బొమ్మను చూసే ప్రజలు ఓట్లేశారని అన్నారు. కేసీఆర్ ఏం చెప్తే అదే చేస్తానాని గంగుల స్పష్టం చేశారు.
సీఎం జగన్ చాలా నిబద్ధతతో పనిచేస్తున్నారు: ఏపీ సీఎస్