telugu navyamedia
క్రీడలు వార్తలు

తొలి టెస్టులో బోణీ కొట్టిన భారత్.. బంగ్లాదేశ్‌ పై ఘన విజయం

indian cricket team condolence to jaitly

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో భారత్ బోణీ కొట్టింది. ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. మయాంక్ అగర్వాల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో డబుల్ సెంచరీతో రాణించడం, సీనియర్ పేసర్ మహ్మద్ షమీ(3/27, 4/31) బుల్లెట్ లాంటి బంతులతో విజృంభించడంతో రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా 213 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో కోహ్లీసేన ఘన విజయం సాధించింది.

విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్‌కిది 10వ ఇన్నింగ్స్ విజయం కావడం విశేషం. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో భారత్‌కు 1-0తో ఆధిక్యం లభించింది. అన్ని రంగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమ్‌ఇండియా బంగ్లాను చిత్తుచిత్తుగా ఓడించింది. ప్రత్యర్థి ఆటగాళ్లు ఏ విభాగంలోనూ స్ఫూర్తిదాయక ఆటతీరుతో ఆకట్టుకోలేకపోయారు. బౌలింగ్, బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమయ్యారు.

Related posts