telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

ఈరోజు బంగారం ధరలు ఇలా…

కరోనా వైరస్‌ ప్రభావంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ అయిపోగానే బంగారం ధరలు దిగివచ్చాయి. దీపావళి కంటే ముందు బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపించిన ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. కానీ ఈరోజు మాత్రం బంగారం ధరలు సిథిరంగా ఉన్నాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 52,430 కు పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,060 వద్ద ముగిసింది. హైదరాబాద్ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,070కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 45,900 పలుకుతోంది. వెండి విషయానికి వస్తే రూ. 1200 పెరగడంతో రూ.66,800 కు చేరుకుంది. అయితే బంగారం ధరలు ఇలానే స్థిరంగా మరి కొన్ని రోజులు ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి. కానీ అందులో ఎంత నిజం ఉందొ తెలియదు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts