telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న జోగినిపల్లి సంతోష్ కుమార్…

మన దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అయితే దేశంలోనే కాదు ఇక్కడ తెలంగాణలో కూడా కరోనా విజృంభిస్తూనే ఉంది. మొన్నటి వరకు తగ్గిన కరోనా కేసులు ఇప్పుడు పెరుగుతున్నాయి. ప్రతి రోజూ 500 మేర కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కరోనా వ్యాక్సిన్లు వేయించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.  ఈ నేపథ్యంలో ఈరోజు నిమ్స్ హాస్పిటల్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారితో కలిసి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా జోగినపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ…  కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలు ఎవరు కూడా భయపడకూడదు అని ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వలన ఎలాంటి ప్రమాదం ఉండదని తెలిపారు. సంతోష్ గారి వెంట నిమ్స్ డైరెక్టర్,డాక్టర్ గంగాధర్, డాక్టర్ రమేష్  తదితరులు ఉన్నారు. కాగా.. ఇప్పటికే తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ కవిత కరోనా వ్యాక్సినేషన్‌ వేయించుకున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి వీరి పై ఆ వ్యాక్సిన్ ఏ విధంగా ప్రభం చూపిస్తుంది అనేది.

Related posts