ఛీటింగ్ కేసులో పరారీలో ఉన్న సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే నహిద్ హసన్ ఇంటికి ఆస్తుల అటాచ్కు సంబంధించి నోటీసులు జారీ అయ్యాయి. ఈ మేరకు ఆస్తులు అటాచ్ చేయాలని ముజఫర్నగర్ కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. పోలీసులు ఖైరానా ఎమ్మెల్యే నహిద్ అహన్ ఇంటికి ఆస్తుల అటాచ్కు సంబంధించి నోటీసులంటించారు.
క్రిమినల్ పీనల్ కోడ్లోని 82 సెక్షన్ కింద ఎమ్మెల్యే ఇంటికి నోటీసులు అంటించామని శామ్లీ జిల్లా ఎస్పీ అజయ్ కుమార్ తెలిపారు. నహిద్ హసన్పై మొత్తం 12 కేసులు నమోదయ్యాయి. నవంబర్ 5 వరకు కోర్టు ఎదుట హాజరు కావాలని ఎమ్మెల్యే నహిద్ హసన్కు గడువు ఇచ్చినట్లు తెలిపారు.