telugu navyamedia
రాజకీయ వార్తలు

ఫ్రాన్స్ పర్యటనకు బయలుదేరిన రాజ్‌నాథ్

Rajnath Singh inaugurates NIA office

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్ బయలుదేరారు. ఫ్రాన్స్ నుంచి భారత వాయుసేన కొనుగోలు చేస్తున్న 36 రాఫెల్ యుద్ధ విమానాల్లో తొలి విమానాన్ని స్వీకరించడానికి ఆయన ఈ పర్యటన చేపట్టారు. భారత వాయుసేన ఆవిర్భావ దినోత్సవమైన అక్టోబర్ 8న ఫ్రాన్స్ భారత్‌కు తొలి రాఫెల్ యుద్ధ విమానాన్ని అందజేయనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమంలో రాజ్‌నాథ్ పాల్గొని, తొలి రాఫెల్‌ యుద్ధ విమానాన్ని అందుకుంటారు. రాఫెల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ డసాల్ట్ ఏవియేషన్‌కు చెందిన అధికారులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

Related posts