కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్ బయలుదేరారు. ఫ్రాన్స్ నుంచి భారత వాయుసేన కొనుగోలు చేస్తున్న 36 రాఫెల్ యుద్ధ విమానాల్లో తొలి విమానాన్ని స్వీకరించడానికి ఆయన ఈ పర్యటన చేపట్టారు. భారత వాయుసేన ఆవిర్భావ దినోత్సవమైన అక్టోబర్ 8న ఫ్రాన్స్ భారత్కు తొలి రాఫెల్ యుద్ధ విమానాన్ని అందజేయనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమంలో రాజ్నాథ్ పాల్గొని, తొలి రాఫెల్ యుద్ధ విమానాన్ని అందుకుంటారు. రాఫెల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ డసాల్ట్ ఏవియేషన్కు చెందిన అధికారులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
మంత్రి పదవి దక్కలేదని తనకు బాధలేదు: రోజా