డిసెంబర్ 6వ తేదీ, 1992 వ సంవత్సరంలో యోధ్యలోని బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం నేడు బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తుది తీర్పు లక్నోలో తీర్పు వెలువడనుంద. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను పెంచాలంటూ ఆదేశించారు.
ఈ కేసులో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి సీనియర్ నేతలతోపాటు సంఘ్ పరివార్ నేతలు, ప్రస్తుతం రామాలయ నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ తదితరులు నిందితులుగా ఉండడంతో ఎలాంటి తీర్పు వస్తుందోనని దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. తీర్పు నేపథ్యంలో నిందితులందరూ కోర్టుకు హాజరు కావాల్సిందేనని న్యాయమూర్తి ఆదేశించారు.
1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ (92), కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి (86), యూపీ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి, సాధ్వి రితంబర వంటి మొత్తం 49 మంది నిందితులుగా ఉన్నారు.
రాచరిక పాలనలో తెలంగాణ బందీ: రేవంత్రెడ్డి