టీడీపీ పార్టీకి…2019 నుంచి అస్సలు అచ్చిరావడం లేదు. 2019 లో అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో అధికారం కోల్పోయిన టీడీపీ పార్టీ.. ఆ తర్వాత కీలక నాయకులను దూరం చేసుకుంది. ఇటివల జరిగిన పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రజలకు టీడీపీ దగ్గర కాలేకపోయింది. మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం చిత్తు చిత్తుగా ఓడిపోయింది టీడీపీ. ఈ షాక్ నుంచి కోలుకోకముందే టీడీపీకి మరో షాక్ తగిలింది. తాజాగా ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబుకి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు సీఐడీ అధికారులు. అంతేకాదు రెండు బృందాలుగా సీఐడీ అధికారులు హైదరాబాద్ వెళ్లినట్లు తెలుస్తోంది. అమరావతి రాజధానిలో భూముల కొనుగోలు, అమ్మకాలపై చంద్రబాబుపై కేసు నమోదు చేశారు సీఐడీ అధికారులు. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు సీబీఐ అధికారులు. చంద్రబాబుతో సహా మాజీ మంత్రి నారాయణకూ సీఐడీ నోటీసులు జారీ చేసారు. 41సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చినట్లు సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ పేర్కొన్నారు. అయితే.. దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.
previous post
కశ్మీర్ ప్రజలను జైలుకు తరలిస్తున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా