అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఘాటుగా స్పందించారు. శనివారం హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ఆగస్టు 15 తర్వాత అసలైన పాలన చూస్తారనటం అభ్యంతరకరంగా ఉందన్నారు. అంటే ఈ ఐదున్నరేళ్లు నకిలీ పాలన చేశారా..? అంటూ ప్రశ్నించారు.
ఈఎస్ఐలో అవినీతిపై సీబీఐ విచారణ కోరే ధైర్యం కేసీఆర్కు లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన మున్సిపల్ చట్టంతో స్థానిక సంస్థలు నిర్వీర్యమవుతాయని దత్తాత్రేయ విమర్శించారు. బీజేపీపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారపూరిత స్వభావాన్ని చూపుతున్నాయని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ మున్సిపాలిటీలను బీజేపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.