telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీలో పెరిగిన కరోనా మరణాలు…

corona vaccine India

ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 9.76 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 8,987 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,76,987 కు చేరింది. ఇందులో 9,15,626 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 53,889 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 35 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7,472 మంది మృతి చెందారు. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 3,116 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ కరోనా ఉధృతి పూర్తిగా తగ్గిపోలేదని, జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 37,922 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

Related posts