telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనా నియంత్రణలో మోదీ అగ్రస్థానం: మార్నింగ్ కన్సల్ట్

Modi Mask

కరోనా నియంత్రణ చర్యలను పకడ్బంధీగా అమలు చేయడంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. ప్రపంచ దేశాల అధినేతలకు ఎవరికీ అందనంత ఎత్తున నిలిచారు. ఈ విషయాన్ని వీడీపీ అసోసియేట్స్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా పోలింగ్ సేవలను అందిస్తున్న ‘మార్నింగ్ కన్సల్ట్’ తాజాగా నిర్వహించిన సర్వే తరువాత, ప్రపంచ ప్రధానులు, అధ్యక్షుల ర్యాంకులను ప్రకటించిందని పేర్కొంది.

ఈ ర్యాంకుల ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ 68 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. మెక్సికో అధ్యక్షుడు లోపేజ్ కు 36, యూకే ప్రధాని జాన్సన్ కు 35, ఆస్ట్రేలియా ప్రధాని మోరిస్ కు 26 పాయింట్లు దక్కాయి. ఇక, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మైనస్ 3 పాయింట్లు లభించాయి. ఈ జాబితాలో ట్రుడావ్ కు 21, మెర్కెల్ 16, బోల్సోనారా 8 పాయింట్లతో ఉండగా, మార్కాన్ మైనస్ 21, షింజో అబే మైనస్ 33 పాయింట్లతో ఉన్నారు.

Related posts