telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు

హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం.. ప్రైవేటు బస్సు ఢీకొని యువతి మృతి

Accident

హైదరాబాద్ నగరంలోని ఛాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నల్లగొండ క్రాస్‌రోడ్డు వద్ద విషాద సంఘటన చోటు చేసుకుంది. సైదాబాద్‌కు చెందిన కావ్య(23) అనే యువతి స్కూటీపై వెళ్తుండగా టీఎస్ యూఏ5330 నెంబర్‌గల ప్రైవేటు బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది.

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కావ్య ఆర్ఆర్బీ పరీక్ష రాయడానికి అల్వల్ కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Related posts