telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు బంగారు కృష్ణ మృతి…

TRS flag

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు అందరూ నిన్న సంక్రాంతి పండుగను చాలా సంతోషంగా జరుపుకున్నారు. అయితే సంక్రాంతి పండుగ రాగానే అందరికీ గుర్తుకు వచ్చేది గాలిపటాలు. అయితే… ఈ గాలిపటాలు ఎగురవేసేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి.  ఇక సరదాగా చిన్నపిల్లలు గాలిపటం ఎగరవేస్తుంటే మాత్రం.. తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి. అంతే కాదు… రోడ్డున వెళ్తున్న సమయంలో… అడ్డుగా మాంజా ఉందేమో గమనిస్తే మంచిది. కాస్త అజాగ్రత్తగా ఉంటే.. అంతే మన ప్రాణాలకే ముప్పు.  అయితే… తాజాగా ఈ గాలిపటం ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నది.  ఈ ఘటన ముషీరాబాద్‌లో చోటు చేసుకుంది. మృతి చెందింది ఎవరో కాదు… టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు బంగారు కృష్ణ. బంగారు కృష్ణ సంక్రాంతి పండుగ సందర్భంగా.. బిల్డింగ్‌ పైకి ఎక్కి గాలిపటం ఎగురవేశాడు. ఈ నేపథ్యంలో ఆయన కాలు జారి కింద పడిపోయాడు. దీంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆయన మృతితో ఆయన కుటుంబ సభ్యులు, స్థానికులు ఒక్కసారిగా విషాద ఛాయల్లోకి వెళ్లారు. ఇక బంగారు కృష్ణ మృతికి పలువురు సీనియర్ నాయకులు సంతాపం ప్రకటించారు.

Related posts