కార్లు కొనుగోలు చేసేవారికి జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ ఆడీ శుభవార్త చెప్పింది. భారత్లో కొన్ని మోడల్ కార్లపై భారీ తగ్గింపు ఆఫర్ ప్రకటించింది. ఆడీ క్యూ5, ఆడీ క్యూ7 కార్లపై రూ.. 6.02లక్షల వరకు తగ్గించింది. ఈ మోడల్ కార్లు భారత్లోకి వచ్చి పదిసంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ ఆఫర్ను తీసుకువచ్చింది.
ప్రస్తుతం మార్కెట్లో ఆడీ క్యూ ధర రూ.. 78.01లక్షలు ఉండగా… ఈ పరిమితి కాల ఆఫర్ కింద రూ.. 49.99లక్షలకే రానుంది. ఇదేకాక ఆడీ క్యూ7 డీజిల్ వేరియంట్ ధరను రూ.. 78.01లక్షల నండి రూ.. 68.99లక్షలకు దిగజారింది. క్యూ7 డీజిల్ వేరియంట్ ధర రూ.. 78.01లక్షలు ఉంటే ..ఆఫర్లలో 71.99లక్షలకు ఇస్తున్నట్లు కంపెనీ పేర్కొంది