బీహార్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అనంత్ సింగ్ ఇంటి పై పోలీసులు శుక్రవారంనాడు దాడులు జరిపారు. మేజిస్ట్రేట్ సమక్షంలో ఇంటి తాళం తెరిచి జరిపిన సోదాల్లో ఒక ఏకే-47 రైఫిల్, లైవ్ బుల్లెట్లు, గ్రనేడ్ దొరకడంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నవడా గ్రామంలోని అనంత్ సింగ్ పూర్వీకుల ఇంటిపై ఈ దాడులు జరిగాయి.
ఆయన నివాసంలో ఒక బాంబు కూడా కనిపించడంతో పోలీసులు బాండ్ డిస్పోజల్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్లను రప్పించారు. ఏటీఎస్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. ఏకే-47, ఇతర అనుమానాస్పద వస్తువులు స్వాధీనం చేసుకున్నాం. పాట్నా నుంచి బాంబ్ స్క్వాడ్ను రప్పించాం. ఎమ్మెల్యే అనంత్ సింగ్ నివాసం నుంచి వీటిని స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ జరుపుతున్నాం’ అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. నిర్దిష్ట సమాచారంతోనే ఈ దాడులు జరిపామని, పెద్దఎత్తున ఆయుధాలు, ఆయుధ సామగ్రి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.